|

షాకిచ్చే రేటుకు'రచ్చ'ఆడియో రైట్స్
రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ప్రతీ విషయంలో ఏదో ఒక సంచలనానికి తెర తీస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్మి రికార్డు క్రియేట్ చేసింది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ భారీ మొత్తాన్ని చెల్లించి తీసుకున్నారు. ఆడియో విడుదల పంక్షన్ ని గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో .. కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న ఆడియో విడుదల చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట ఇప్పటికే నెట్ లో లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
|